పశుసంవర్థక శాఖ పరిధిలోని పశువైద్యులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను మంత్రి అప్పల రాజు ప్రారంభించారు. అనంతరం బోధన, బోధనేతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పశువైద్య విద్యలో భాగంగా ఫిషరీష్ విభాగానికి ప్రత్యేకంగా మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మిషన్ పుంగనూరులో భాగంగా దేశీ రకాలైన పుంగనూరు జాతి ఆవుల సంఖ్య పెంచడానికి చర్యలు తీసుకొంటున్నామన్నారు. సూపర్ నేపియర్ రకం గడ్డి విత్తనాలను పంపిణీ చేశామని... ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు పాడి ఉత్పత్తిలో లాభాలు సాధించడానికి చర్యలు చేపట్టామని వివరించారు.
ఇదీ చదవండి: సీఎం జగన్ సీరియస్.. క్యాంపు కార్యాలయానికి విశాఖ నేతలు