ETV Bharat / state

వేతనాలు చెల్లించాలని వలస కూలీల ఆందోళన

వలస కూలీలు తమ స్వగ్రామలకు వెళ్లొచ్చని ప్రభుత్వం అనుమతించినప్పటికీ... యజమానులు వేతనాలు చెల్లించని కారణంగా ఇబ్బంది పడుతున్నారు. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పైప్స్ పరిశ్రమ వలస కూలీలు ఈ మేరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ముందు వేతనాలు చెల్లించాలని ఆందోళనకు దిగారు.

author img

By

Published : May 9, 2020, 9:27 PM IST

migrate workers demands for their wages in chittoor dst srikalahasthi
migrate workers demands for their wages in chittoor dst srikalahasthi

పని చేయించుకొని వేతనాలు చెల్లించని కారణంగా.. స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ధర్నాకు దిగారు.

సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా.. పరిశ్రమ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో డబ్బులు లేక స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని బీహార్, ఒడిశా, ఛత్తీస్​గఢ్ కు చెందిన కార్మికులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కష్టానికి సంబంధించిన కూలీ అడిగినందుకు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.

పని చేయించుకొని వేతనాలు చెల్లించని కారణంగా.. స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని వలస కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని శ్రీకాళహస్తి పైప్స్ పరిశ్రమలో పనిచేసే వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ధర్నాకు దిగారు.

సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినా.. పరిశ్రమ యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో డబ్బులు లేక స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని బీహార్, ఒడిశా, ఛత్తీస్​గఢ్ కు చెందిన కార్మికులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కష్టానికి సంబంధించిన కూలీ అడిగినందుకు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.

ఇదీ చూడండి:

హైదరాబాద్ నుంచి ఒడిశాకు సైకిల్​పై ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.