కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను.. చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు-తిరుపతి రహదారిలోని డి.వెంగనపల్లి క్రాస్ వద్ద.. వారి నుంచి 1,104 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.75 లక్షల విలువ ఉంటుందని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
ఈరోజు తెల్లవారుజామున డి.వెంగనపల్లి క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. కర్నాటక నుంచి తరలిస్తున్న మద్యం దొరికింది. అక్రమ రవాణాకు పాల్పడిన టి.రాజా, రెడ్డి ప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్ఈసీ