ETV Bharat / state

కేటుగాళ్లు... నకిలీ బంగారం నాణేలతో మోసాలు - chittoor crime news

'మాకు తెలిసిన వ్యక్తి దగ్గర బంగారు నాణేలు ఉన్నాయి. చాలా తక్కువ ధరకు అమ్ముతానంటున్నాడు. వాటి ధర లక్షల్లో ఉంటుంది. ఇంకా ఎక్కువకు అమ్ముకోవచ్చు' అని మాయమాటలు చెబుతూ ఆశ చూపి నకిలీ బంగారు నాణాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు చిత్తూరు పోలీసులు.

Gold coins  culprits in chittoor
కేటుగాళ్లు... నకిలీ బంగారం నాణాలతో మోసాలు
author img

By

Published : Dec 26, 2019, 12:03 AM IST

నిందితుల వివరాలు తెలుపుతున్న సీఐ
బంగారు నాణేల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పెద్దచర్ల గుంట వద్ద బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను గంగవరం సీఐ రామకృష్ణ చారి బుధవారం మీడియాకు తెలిపారు. నిందితులు నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సీఐ చెప్పారు. ఐదుగురు ముఠాగా ఏర్పాడి బంగారు నాణేలు చూపి మోసాలు పాల్పడుతున్నారన్నారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నకిలీ బంగారం, గుప్త నిధులు, అక్షయపాత్ర అని మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ రామకృష్ణ చారి సూచించారు.

ఇదీ చదవండి :

గంజాయి అక్రమంగా తరలిస్తోన్న యువకుల అరెస్టు

నిందితుల వివరాలు తెలుపుతున్న సీఐ
బంగారు నాణేల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా పెద్దచర్ల గుంట వద్ద బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను గంగవరం సీఐ రామకృష్ణ చారి బుధవారం మీడియాకు తెలిపారు. నిందితులు నకిలీ బంగారు నాణేలతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సీఐ చెప్పారు. ఐదుగురు ముఠాగా ఏర్పాడి బంగారు నాణేలు చూపి మోసాలు పాల్పడుతున్నారన్నారు. వీరిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నకిలీ బంగారం, గుప్త నిధులు, అక్షయపాత్ర అని మాయ మాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ రామకృష్ణ చారి సూచించారు.

ఇదీ చదవండి :

గంజాయి అక్రమంగా తరలిస్తోన్న యువకుల అరెస్టు

Intro:ap_tpt_51_25_mosagaalla_arrest_vob_ap10105

తక్కువకు కొని..ఎక్కువకు అమ్మేద్దం..!!!
* ఆశ చూపి మోసం చేసిన ఘటనలో నిందితుల అరెస్టు
* ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ విజ్ఞప్తిBody:తమకు తెలిసిన వారి వద్ద బంగారు నాణాలు ఉన్నాయని వాటిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అని కల్పించి మోసం చేసిన ఘటనలో నలుగురు నిందితులను చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీసులు బైరెడ్డిపల్లి మండలం పెద్ద చర్ల గుంట సమీపంలో మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గంగవరం సిఐ రామకృష్ణ చారి గంగవరం పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల అరెస్ట్ చూపి వివరాలను వెల్లడించారు. నకిలీ బంగారు నాణేల తో మీరు ఇప్పటికే పలు మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని సిఐ చెప్పారు. వీరు అయిదుగురు కలిసి మోసాలకు పాల్పడుతూ ఉండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సిఐ తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులకు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రకటించారన్నారు. నకిలీ బంగారం, నిధులు, అక్షయపాత్ర వంటి మాటలతో పలువురు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మోసాలకు గురి కావద్దని సిఐ విజ్ఞప్తి చేశారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.