చిత్తూరు జిల్లా పూతలపట్టు - నాయుడు పేట జాతీయరహదారిపై రామచంద్రాపురం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పనసకాయలను రవాణా చేస్తున్న ఓ లారీని నిలిపేందుకు ప్రయత్నించారు. ఆ లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించటంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. దీంతో పనసకాయల రవాణా మాటున సాగిస్తున్న గంజాయి అక్రమ రవాణా బట్టబయలైంది.
- కోటి రూపాయల గంజాయి పట్టివేత...
పనసకాయల మాటున 36సంచుల్లో ఉన్న 1064 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మహిళ ఉండటం విశేషం. పోలీసుల విచారణలో వీరంతా గంజాయిని ఒడిశా నుంచి చిత్తూరు జిల్లా పూతలపట్టుకు రవాణా చేస్తున్నట్లు తెలిసింది. వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనావేశారు. ఒక లారీని, కార్ ను సీజ్ చేయటంతో పాటు.... వీరు తప్పించుకునేందుకు వీలు లేకుండా కేసులు నమోదు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు
ఇదీ చూడండి: బిల్డ్ ఏపీ'పై హై కోర్టులో 10 పిటిషన్లు.. సోమవారానికి విచారణ వాయిదా