ETV Bharat / state

వ్యాపారులతో విస్తరిస్తున్న కరోనా.. కారణం అదేనా...?

author img

By

Published : Jun 18, 2020, 12:08 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఇచ్చిన లాక్​డౌన్ సడలింపులతో కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న వ్యాపారులు తరచు బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో వీరి ద్వారా కరోనా విజృంభిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

five more corona cases recorded
వ్యాపారులతో విస్తరిస్తోన్న కరోనా

వ్యాపారుల వలన చిత్తూరు జిల్లా కరోనా కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో బి.కొత్తకోటకు చెందిన వస్త్ర దుకాణాల వ్యాపారి హైదరాబాద్​కు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్​గా నిర్దరణ అయ్యింది. అతనితోపాటు కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు, పని మనిషికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో వ్యాపారి బెంగళూరుకు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదుకు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రమాదకారి అని తెలిసి కూడా వ్యాపారులు డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికీ కరోనాను చేరువ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారుల వలన చిత్తూరు జిల్లా కరోనా కేసులు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో బి.కొత్తకోటకు చెందిన వస్త్ర దుకాణాల వ్యాపారి హైదరాబాద్​కు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్​గా నిర్దరణ అయ్యింది. అతనితోపాటు కుటుంబంలోని ఇద్దరు సభ్యులకు, పని మనిషికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో వ్యాపారి బెంగళూరుకు వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నగరంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఐదుకు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రమాదకారి అని తెలిసి కూడా వ్యాపారులు డబ్బు కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికీ కరోనాను చేరువ చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి.. జవాన్లపై దాడిని ఖండిస్తూ శ్రీకాళహస్తిలో భాజపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.