తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాసేపు స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు పురంధేశ్వరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు.
ఇదీ చదవండి: