ETV Bharat / state

టమాటా రైతులకు మిగిలింది కంట కన్నీరే

లక్షలు అప్పు చేశారు. రెక్కల కష్టం ధారబోశారు. రుణభారం తడిసి మోపెడై చావు అంచుకు చేరారు. టమాటా సాగుకు జాతీయ స్థాయిలోనే పేరుపొందిన చిత్తూరు జిల్లా రైతన్న దుస్థితి ఇది. సమస్యలు మోసుకొచ్చిన లాక్‌డౌన్‌తో... పంటలు పశువులకు మేతగా మిగిలాయి. ఎర్రని టమాటా పళ్లు మొక్కలకే ఎండి వెలవెలబోయాయి. పంటను ట్రాక్టర్లతో తొక్కిస్తున్న, రహదారి పక్కన పారబోస్తున్న దృశ్యాలే అక్కడ ఎటుచూసినా కనిపిస్తున్నాయి.

author img

By

Published : May 24, 2020, 12:57 AM IST

టమాటా.... రైతుల కంట కన్నీల పంట
టమాటా.... రైతుల కంట కన్నీల పంట
టమాటా.... రైతుల కంట కన్నీల పంట

టమాటా సాగుకు పేరుపొందిన చిత్తూరు జిల్లా రైతుల జీవితాలను లాక్‌డౌన్‌ పరిస్థితులు ఛిద్రం చేశాయి. లాక్‌డౌన్ కారణంగా క్రిమి సంహారకాలు దొరక్క కళ్ల ముందే వైరస్‌లు, పురుగులకు పంట ఆహారంగా మారిపోతున్నా రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కొద్దో గొప్పో మిగిలిన పంటను తీసుకొని మార్కెట్‌కెళ్లినా... రైతులను ధరల పతనం పూర్తిగా కుంగదీసింది. టమాటా పెట్టె 40 రూపాయలకు మించి ధర పలకలేదు. పైసా కూడా చేతికి రాలేదు సరికదా... రవాణా, కూలీ ఖర్చులు తిరిగి భరించాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రీపగలూ శ్రమించి సాగుచేసిన టమాటా పంటను తన చేతులతో తానే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రైతన్నల గుండెకోతకు అద్దం పడుతున్నాయి.

టమాటా సాగులో చిత్తూరు జిల్లా జాతీయ స్థాయిలోనే ముందువరుసలో ఉంటుంది. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి సుమారు లక్షన్నర ఎకరాల్లో సాగవుతూ 35వేల రైతు కుటుంబాలకు ఈ పంట జీవనాధారంగా ఉంది. పుంగనూరు, సోమల, మదనపల్లె, సదుం, కల్లూరు, కలికిరి, పీలేరు, రామసముద్రం, తంబళ్లపల్లె ఇలా జిల్లాలోని పడమటి మండలాల్లో, ప్రతి గ్రామంలోనూ రైతన్నలు టమాటా పండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. పుంగనూరు మండలం బైరా మంగళంలో బలవన్మరణానికి పాల్పడిన టమాటా రైతు నాగరాజు విషాదగాథే ఇందుకు నిదర్శనం. 5 లక్షలు అప్పు చేసి టమాటా పండించిన ఆ రైతు... రూపాయి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేక బెంగతో తనువు చాలించాడు.

టమాటా పంటనే నమ్ముకున్న కుటుంబాలు, మహిళా రైతులు అప్పుల వాళ్లకు సమాధానం చెప్పుకోలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం ఆశలు పెట్టుకున్న వారు కలలు కల్లలై తల్లడిల్లుతున్నారు.

జిల్లాలో అధిక మొత్తంలో టమాటా సాగైనందునే డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గిరాకీ పడిపోవడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు. మిగిలిన అన్ని పంటల మాదిరే టమాటాకూ మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కరోనాతో కల్లోలం రేగిన టమాటా రైతుల జీవితాలు గాడిన పడాలంటే ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి

క్యాటరింగ్ రంగంపై కరోనా ప్రభావం

టమాటా.... రైతుల కంట కన్నీల పంట

టమాటా సాగుకు పేరుపొందిన చిత్తూరు జిల్లా రైతుల జీవితాలను లాక్‌డౌన్‌ పరిస్థితులు ఛిద్రం చేశాయి. లాక్‌డౌన్ కారణంగా క్రిమి సంహారకాలు దొరక్క కళ్ల ముందే వైరస్‌లు, పురుగులకు పంట ఆహారంగా మారిపోతున్నా రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కొద్దో గొప్పో మిగిలిన పంటను తీసుకొని మార్కెట్‌కెళ్లినా... రైతులను ధరల పతనం పూర్తిగా కుంగదీసింది. టమాటా పెట్టె 40 రూపాయలకు మించి ధర పలకలేదు. పైసా కూడా చేతికి రాలేదు సరికదా... రవాణా, కూలీ ఖర్చులు తిరిగి భరించాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రీపగలూ శ్రమించి సాగుచేసిన టమాటా పంటను తన చేతులతో తానే ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రైతన్నల గుండెకోతకు అద్దం పడుతున్నాయి.

టమాటా సాగులో చిత్తూరు జిల్లా జాతీయ స్థాయిలోనే ముందువరుసలో ఉంటుంది. ఖరీఫ్, రబీ సీజన్లు కలిపి సుమారు లక్షన్నర ఎకరాల్లో సాగవుతూ 35వేల రైతు కుటుంబాలకు ఈ పంట జీవనాధారంగా ఉంది. పుంగనూరు, సోమల, మదనపల్లె, సదుం, కల్లూరు, కలికిరి, పీలేరు, రామసముద్రం, తంబళ్లపల్లె ఇలా జిల్లాలోని పడమటి మండలాల్లో, ప్రతి గ్రామంలోనూ రైతన్నలు టమాటా పండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. పుంగనూరు మండలం బైరా మంగళంలో బలవన్మరణానికి పాల్పడిన టమాటా రైతు నాగరాజు విషాదగాథే ఇందుకు నిదర్శనం. 5 లక్షలు అప్పు చేసి టమాటా పండించిన ఆ రైతు... రూపాయి కూడా తిరిగొచ్చే పరిస్థితి లేక బెంగతో తనువు చాలించాడు.

టమాటా పంటనే నమ్ముకున్న కుటుంబాలు, మహిళా రైతులు అప్పుల వాళ్లకు సమాధానం చెప్పుకోలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం ఆశలు పెట్టుకున్న వారు కలలు కల్లలై తల్లడిల్లుతున్నారు.

జిల్లాలో అధిక మొత్తంలో టమాటా సాగైనందునే డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయని అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి గిరాకీ పడిపోవడం మరో కారణమని విశ్లేషిస్తున్నారు. మిగిలిన అన్ని పంటల మాదిరే టమాటాకూ మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కరోనాతో కల్లోలం రేగిన టమాటా రైతుల జీవితాలు గాడిన పడాలంటే ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చదవండి

క్యాటరింగ్ రంగంపై కరోనా ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.