ETV Bharat / state

Conflict : భూ తగాదాలతో ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు - crime news in chithore district

భూ వివాదం కారణంగా... చిత్తూరు జిల్లాలోని మిట్టూరు గ్రామంలో ఓ కుటుంబంపై దాడి(attack) జరిగింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్(picketing) ఏర్పాటు చేశారు.

conflict-with-land-issues-in-mitturu-chithore-district
భూ తగాదాలతో ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Jun 27, 2021, 7:43 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని మిట్టూరు గ్రామానికి చెందిన గిరి నాయుడు, సునీల్ నాయుడు లకు సంబంధించిన భూమి ఒకే ప్రాంతంలో ఉంది. ఈ పొలంలో దారి కోసం ఐదు సంవత్సరాలుగా ఇరువురి మధ్య ఘర్షణ(Conflict)లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గిరి నాయుడు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సునీల్ నాయుడు వర్గీయులు తన ఇంట్లో చొరబడి కర్రలు, రాళ్లతో దాడి(attack)కి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్(picketing) ఏర్పాటు చేశారు.

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని మిట్టూరు గ్రామానికి చెందిన గిరి నాయుడు, సునీల్ నాయుడు లకు సంబంధించిన భూమి ఒకే ప్రాంతంలో ఉంది. ఈ పొలంలో దారి కోసం ఐదు సంవత్సరాలుగా ఇరువురి మధ్య ఘర్షణ(Conflict)లు జరుగుతున్నాయి. ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గిరి నాయుడు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సునీల్ నాయుడు వర్గీయులు తన ఇంట్లో చొరబడి కర్రలు, రాళ్లతో దాడి(attack)కి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్(picketing) ఏర్పాటు చేశారు.

ఇదీచదవండి.

corona cases : రాష్ట్రంలో కొత్తగా 4,250 కరోనా కేసులు, 33 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.