పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై.. శాంతిపురం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు తెదేపా నాయకులు చేరుకున్నారు. అదే సమయంలో వైకాపా ప్రచార రథం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
వాగ్వాదంగా మొదలైన ఘటనలో.. ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఘర్షణలో తెదేపా నాయకుడు ఉయ్యాల జయరాం రెడ్డికి గాయాలు కాగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇదీ చదవండి: