చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తిస్తూ.. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలకు కరోనా సోకినట్లు నిర్ధరించారు. వీరి వలన ఇతరులకు వైరస్ సోకే ప్రమాదముందని గుర్తించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక సబ్ జైలును కొవిడ్ ప్రత్యేక జైలుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీలేరు సబ్జైలును కరోనా జైలుగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇందులో ప్రత్యేక అధికారితోపాటు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.
ఇవీ చదవండి...