పలిమారు మఠం పీఠాధిపతి శ్రీవిద్యాదీషా తీర్ధ స్వామిజీ, భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల భాజపా జాతీయ కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. మానవ జాతి శ్రేయస్సు కోసం కరోనా వ్యాక్సిన్ వీలైనంత త్వరగా రావాలని వేంకటేశ్వరస్వామిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. వైరస్ బారి నుంచి ప్రజలకు విముక్తి కలగాలని అన్నారు.
బాలాజీని దర్శించుకున్నవారిలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సంపత్, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ ఉన్నారు.
ఇదీ చదవండి: అనంత స్వర్ణమయానికి స్వస్తి: తితిదే తీర్మానం