ETV Bharat / state

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని తెదేపా అధినేత చంద్రబాబు ఎస్​ఈసీని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Feb 17, 2021, 5:50 PM IST

ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి

పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గుడుపల్లి మండలం సోదిగానిపల్లె, రామకుప్పం మండలం పెద్దూరు గ్రామాల్లో స్థానికేతర వైకాపా నేతలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. పెద్దూరులో రౌడీషీటర్ సత్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైకాపా గూండాల పట్ల పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవటం సరికాదని మండిపడ్డారు. అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందు ప్రయత్నిస్తున్న వారిని నివారించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఇదీచదవండి

రాష్ట్రంలో.. మధ్యాహ్నం 2.30 వరకు 76.43 % పోలింగ్ నమోదు

పంచాయతీ ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. గుడుపల్లి మండలం సోదిగానిపల్లె, రామకుప్పం మండలం పెద్దూరు గ్రామాల్లో స్థానికేతర వైకాపా నేతలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. పెద్దూరులో రౌడీషీటర్ సత్య ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నందున అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న వైకాపా గూండాల పట్ల పోలీసులు చోద్యం చూస్తూ కూర్చోవటం సరికాదని మండిపడ్డారు. అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందు ప్రయత్నిస్తున్న వారిని నివారించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఎస్​ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఇదీచదవండి

రాష్ట్రంలో.. మధ్యాహ్నం 2.30 వరకు 76.43 % పోలింగ్ నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.