చిత్తూరు జిల్లా మదనపల్లిలోని నర్సింగ్ వీధిలో ఓ మహిళ హత్యకు గురైంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలు కారణంగా హత్య జరిగిందా... లేక గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాసిన్ భర్త అంజద్... మసీదులో గురువుగా పనిచేస్తాడు. సాయంత్రం వేళలో ఆయన మసీదుకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ...
రుణాలిచ్చాం... ఇవిగో ఆధారాలు... జగన్ రాజీనామా చేస్తారా..? చంద్రబాబు