నాటుసారా స్థావరాలపైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏర్పేడు మండలం ముసలిపెడు సమీపంలో నాటుసారా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించి.. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.120 లీటర్ల సారా, ఆటో , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమల డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం