ETV Bharat / state

Amaravathi padayatra: తుదిఘట్టానికి అమరావతి రైతుల పాదయాత్ర.. తొలిరోజు నాటి ఉత్సాహంతో రైతులు

author img

By

Published : Dec 14, 2021, 10:28 AM IST

Updated : Dec 14, 2021, 12:22 PM IST

Amaravathi Farmers Mahapadayatra: అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. అమరావతే ఏకైక రాజధానిగా అన్నదాతలు అలుపెరుగకండా కొనసాగిస్తున్న మహాపాదయాత్ర నేటితో ముగియనుంది. నేడు తిరుపతి నగరంలో కొనసాగుతున్న పాదయాత్ర సాయంత్రం అలిపిరి వద్ద ముగియనుంది. పాదయాత్రకు ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, కుల, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు మద్దతు తెలుతుతున్నాయి.

తుదిఘట్టానికి అమరావతి మహాపాదయాత్ర
తుదిఘట్టానికి అమరావతి మహాపాదయాత్ర
తుదిఘట్టానికి అమరావతి మహాపాదయాత్ర

Amaravathi Farmers Mahapadayatra: అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. చివరి రోజు జన సంద్రాన్ని తలపిస్తూ ముందుకు సాగుతోంది. అడుగడుగునా గోవిందా స్మరణతో రైతులు తిరుపతి వీదుల్లో తమ నడకను ప్రారంభించారు. వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కుల, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానికులు పాదయాత్రకు మద్దతుగా తరలి వచ్చారు.

తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు, పుంగనూరు నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు రైతుల వెంట పాదం కదిపారు. అమరావతి రాజధానికే రాయలసీమ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని నల్లారి కిశోర్‌ స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర మధ్యాహ్నానికి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, ఇతర నేతలు రైతులకు స్వాగతం పలికి, పాదయాత్రకు మద్దతు పలికారు.

44 రోజులు 400 కిలోమీటర్లు..

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవంబర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులుగా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైకాపా మినహా..అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు. పేరు చెప్పుకోకుండా మండల స్థాయి వైకాపా నేతలు పలుచోట్ల పాదయాత్రకు నైతిక మద్దతు ప్రకటించారు.

భారీ బహిరంగ సభ..

నేడు తిరుపతి నగరంలో కొనసాగుతున్న పాదయాత్ర అలిపిరి వద్ద ముగియనుంది. సాయంత్రం అలిపిరి వద్దకు చేరుకుని 108 కొబ్బరికాయలు కొట్టడంతో మహాపాదయాత్రను ముగించనున్నారు. రేపు, ఎల్లుండి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. 17న అమరావతి ఆకాంక్షను చాటేలా భారీ బహిరంగా సభ నిర్వహించాలని భావించారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బహిరంగ సభకు ఏదైనా ఆటంకాలు ఎదురైతే ప్రస్తుతం బస చేస్తున్న రామానాయుడు కళ్యాణమండపం ప్రాంతంలోనే సభ నిర్వహించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి అనుమతి..

శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు తితిదే అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని తితిదే స్పష్టం చేసింది. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి తితిదే అంగీకరించింది.

ఇదీ చదవండి

maha padayatra: తుది ఘట్టానికి చేరువైన అమరావతి రైతుల పాదయాత్ర

తుదిఘట్టానికి అమరావతి మహాపాదయాత్ర

Amaravathi Farmers Mahapadayatra: అమరావతి రైతుల న్యాయస్థానం-దేవస్థానం మహాపాదయాత్ర తుదిఘట్టానికి చేరింది. చివరి రోజు జన సంద్రాన్ని తలపిస్తూ ముందుకు సాగుతోంది. అడుగడుగునా గోవిందా స్మరణతో రైతులు తిరుపతి వీదుల్లో తమ నడకను ప్రారంభించారు. వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కుల, వృత్తి సంఘాలు, రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి స్థానికులు పాదయాత్రకు మద్దతుగా తరలి వచ్చారు.

తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పీలేరు, పుంగనూరు నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు రైతుల వెంట పాదం కదిపారు. అమరావతి రాజధానికే రాయలసీమ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందని నల్లారి కిశోర్‌ స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర మధ్యాహ్నానికి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుంది. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, ఇతర నేతలు రైతులకు స్వాగతం పలికి, పాదయాత్రకు మద్దతు పలికారు.

44 రోజులు 400 కిలోమీటర్లు..

న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట నవంబర్ 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర నేటితో ముగియనుంది. రైతులు గత 44 రోజులుగా 400 కిలోమీటర్లు పైగా నడిచారు. పాదయాత్రకు గుంటూరుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైకాపా మినహా..అన్ని రాజకీయ పక్షాలు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు. పేరు చెప్పుకోకుండా మండల స్థాయి వైకాపా నేతలు పలుచోట్ల పాదయాత్రకు నైతిక మద్దతు ప్రకటించారు.

భారీ బహిరంగ సభ..

నేడు తిరుపతి నగరంలో కొనసాగుతున్న పాదయాత్ర అలిపిరి వద్ద ముగియనుంది. సాయంత్రం అలిపిరి వద్దకు చేరుకుని 108 కొబ్బరికాయలు కొట్టడంతో మహాపాదయాత్రను ముగించనున్నారు. రేపు, ఎల్లుండి రైతులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. 17న అమరావతి ఆకాంక్షను చాటేలా భారీ బహిరంగా సభ నిర్వహించాలని భావించారు. సభకు పోలీసులు అనుమతి నిరాకరించటంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బహిరంగ సభకు ఏదైనా ఆటంకాలు ఎదురైతే ప్రస్తుతం బస చేస్తున్న రామానాయుడు కళ్యాణమండపం ప్రాంతంలోనే సభ నిర్వహించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనానికి అనుమతి..

శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు తితిదే అనుమతి ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని తితిదే స్పష్టం చేసింది. బుధవారం ఒక్కరోజే మొత్తం 500 మందికి శ్రీవారి దర్శనానికి తితిదే అంగీకరించింది.

ఇదీ చదవండి

maha padayatra: తుది ఘట్టానికి చేరువైన అమరావతి రైతుల పాదయాత్ర

Last Updated : Dec 14, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.