ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి - చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదం తాజా సమాచారం

ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబసభ్యులను మాజీమంత్రి అమరనాథ్​రెడ్డి పరామర్శించారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైకు... ముగ్గురు మృతి
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైకు... ముగ్గురు మృతి
author img

By

Published : Dec 1, 2019, 10:24 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు పెద్దపంజాని మండలం జిట్టంవారిపల్లె గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బంధువుల దినకర్మకు వెళ్లి... తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే రామకృష్ణప్ప అనే వ్యక్తి మృతి చెందగా... పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రాజన్న, మునిచంద్రా రెడ్డి మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీమంత్రి అమరనాథ్​రెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు పెద్దపంజాని మండలం జిట్టంవారిపల్లె గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బంధువుల దినకర్మకు వెళ్లి... తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే రామకృష్ణప్ప అనే వ్యక్తి మృతి చెందగా... పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రాజన్న, మునిచంద్రా రెడ్డి మృతిచెందారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాజీమంత్రి అమరనాథ్​రెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఇదీ చదవండి :

అనంతపురంలో బస్సు ప్రమాదం...యువతి మృతి

Intro:ap_tpt_51_01_bike_accident_3_mens_died_av_ap10105

ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీ
* ముగ్గురు మృతిBody:చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఎదురుగా వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పెద్దపంజాని మండలం జిట్టంవారిపల్లె గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంగవరం మండలం బూడిద పల్లె గ్రామంలో బంధువుల దినకర్మ లకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్లేందుకు చౌడేపల్లె వైపుగా వెళ్తుండగా కోగిలేరు గ్రామం సమీపంలో చౌడేపల్లె నుంచి పలమనేరు వైపుకు వస్తున్న పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు ఎదురు వెళ్లి ఢీ కొన్నారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలోనే రామకృష్ణప్ప అనే వ్యక్తి మృతి చెందగా.. పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ రాజన్న, ముని చంద్ర రెడ్డి అనే మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకొని ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబసభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి సిబ్బంది మార్చురీకి తరలించగా పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.