ETV Bharat / state

రెండు బైక్​లు ఢీ... యువకుడు మృతి

author img

By

Published : Apr 5, 2021, 5:53 PM IST

ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా అమరాపురం మండలం జమ్ములబండ గ్రామం సమీపంలో జరిగింది. మృతుడిని మడకశిర పట్టణానికి చెందిన నాగరాజుగా గుర్తించారు.

రెండు బైక్​లు ఢీ...యువకుడి మృతి
రెండు బైక్​లు ఢీ...యువకుడి మృతి

అనంతపురం జిల్లా అమరాపురం మండలం జమ్ములబండ గ్రామం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మడకశిర పట్టణానికి చెందిన నాగరాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరికొంత మందికి స్వల్ప గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ సంఘటన స్థలికి వెళ్లారు.

తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. వెంటనే నాగరాజును... హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.

అనంతపురం జిల్లా అమరాపురం మండలం జమ్ములబండ గ్రామం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మడకశిర పట్టణానికి చెందిన నాగరాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరికొంత మందికి స్వల్ప గాయలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గుడిబండ ఎస్ఐ సుధాకర్ యాదవ్ సంఘటన స్థలికి వెళ్లారు.

తీవ్రగాయాలపాలైన క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. వెంటనే నాగరాజును... హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.

ఇవీ చదవండి:

గాలి జనార్దన్ వ్యాజ్యంపై సుప్రీంలో విచారణ.. తీర్పు రిజర్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.