ETV Bharat / state

తెదేపా నాయకులపై వైకాపా వర్గీయుల దాడి - ycp activists attack on tdp leaders at obulapuram

అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య గొడవ జరిగింది. వైకాపా వర్గీయులు.. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తెదేపా నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.

ycp activists attack on tdp leaders at obulapuram
తెదేపా నాయకులపై కర్రలతో దాడి చేసిన వైకాపా వర్గీయులు
author img

By

Published : Feb 12, 2021, 6:32 PM IST

రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా... అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో తెదేపా, వైకాపా నాయకులు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు విరుపాక్షి గౌడ్, ఆయన సోదరుడితో వైకాపా వర్గీయులు ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో వైకాపా వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తెదేపా నాయకులు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా... అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో తెదేపా, వైకాపా నాయకులు మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు విరుపాక్షి గౌడ్, ఆయన సోదరుడితో వైకాపా వర్గీయులు ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో వైకాపా వర్గీయులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ తెదేపా నాయకులు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.