ETV Bharat / state

సచివాలయ ఉద్యోగిపై వైకాపా కార్యకర్త దాడి!

author img

By

Published : Aug 25, 2021, 8:30 PM IST

అనంతపురంలో సచివాలయం ఉద్యోగిపై వైకాపా కార్యకర్త దాడి చేశాడు. యువజన కాలనీ 60వ సచివాలయంలో అడ్మిన్​గా విధులు నిర్వహిస్తున్న తనపై వైకాపా కార్యకర్త విజయ్ కుమార్ దాడి చేసినట్లు బాధితుడు రమేష్​ తెలిపాడు. ఈ విషయంపై త్రీటౌన్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు.

బాధితుడు రమేశ్
బాధితుడు రమేశ్

అనంతపురంలో సచివాలయం ఉద్యోగిపై వైకాపా కార్యకర్త దాడిచేశాడు. నగరంలోని యువజన కాలనీ 60వ సచివాలయంలో అడ్మిన్​గా విధులు నిర్వహిస్తున్న తన​పై అదే కాలనీకి చెందిన విజయ్ కుమార్ అనే వైకాపా కార్యకర్త దాడి చేసినట్లు బాధితుడు రమేష్ త్రీటౌన్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సచివాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి రిజిస్టర్ పుస్తకాన్ని ఫొటోలు తీసుకుంటుండగా ఎందుకు అలా చేస్తున్నావ్? అని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు రమేష్ తెలిపాడు. వైకాపా నాయకుల దౌర్జన్యాలతో సచివాలయ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ రెడ్డప్ప తెలిపారు.

అనంతపురంలో సచివాలయం ఉద్యోగిపై వైకాపా కార్యకర్త దాడిచేశాడు. నగరంలోని యువజన కాలనీ 60వ సచివాలయంలో అడ్మిన్​గా విధులు నిర్వహిస్తున్న తన​పై అదే కాలనీకి చెందిన విజయ్ కుమార్ అనే వైకాపా కార్యకర్త దాడి చేసినట్లు బాధితుడు రమేష్ త్రీటౌన్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సచివాలయంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి రిజిస్టర్ పుస్తకాన్ని ఫొటోలు తీసుకుంటుండగా ఎందుకు అలా చేస్తున్నావ్? అని ప్రశ్నించినందుకు దాడి చేసినట్లు రమేష్ తెలిపాడు. వైకాపా నాయకుల దౌర్జన్యాలతో సచివాలయ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ రెడ్డప్ప తెలిపారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.