ETV Bharat / state

ఆధార్​ సేవా కేంద్రాల వద్ద మహిళల పడిగాపులు - Aadhaar service centers in Anantapur

అనంతపురం జిల్లా గుడిబండ ఎమ్మార్వో ఆఫీస్​లోని ఆధార్ సేవా కేంద్రం వద్ద మహిళలు పడిగాపులు గాస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్​కు ఫోన్ నంబర్ లింక్ చేయించడం కోసం ఇలా బారులుదీరారు.

ఆధార్ సేవా కేంద్రం వద్ద మహిళలు పడిగాపులు
Aadhaar service center in Anantapur
author img

By

Published : May 28, 2021, 7:28 PM IST

వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు(మహిళలు) ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఈ పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్​కు మొబైల్ లింక్ కోసం అనంతపురం జిల్లాలోని పలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద మహిళలు బారులుదీరారు. గుడిబండ తహసీల్దార్ కార్యాలయంలోని ఆధార్ కేంద్రం వద్ద మహిళలు ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నారు. అధిక సంఖ్యలో రావడంతో కొవిడ్ నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడ సేవలను నిలిపివేశారు. అయితే మహిళలు ఆందోళన చేయడంతో రెవెన్యూ అధికారులు.. పోలీసుల సహకారంతో తిరిగి సేవలు ప్రారంభించారు. సెంటర్ వద్దకు అధిక మంది రావడంతో వైరస్ బారినపడే అవకాశం ఉన్నందున అన్ని మండలాల్లోని ఆధార్ కేంద్రాల్లో ఈ సేవలు కొనసాగించాలని మహిళలు డిమాండ్ చేశారు.

వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులు(మహిళలు) ఆధార్ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఈ పథకం గడువు సమీపిస్తుండటంతో ఆధార్​కు మొబైల్ లింక్ కోసం అనంతపురం జిల్లాలోని పలు ఆధార్ సేవా కేంద్రాల వద్ద మహిళలు బారులుదీరారు. గుడిబండ తహసీల్దార్ కార్యాలయంలోని ఆధార్ కేంద్రం వద్ద మహిళలు ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నారు. అధిక సంఖ్యలో రావడంతో కొవిడ్ నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడ సేవలను నిలిపివేశారు. అయితే మహిళలు ఆందోళన చేయడంతో రెవెన్యూ అధికారులు.. పోలీసుల సహకారంతో తిరిగి సేవలు ప్రారంభించారు. సెంటర్ వద్దకు అధిక మంది రావడంతో వైరస్ బారినపడే అవకాశం ఉన్నందున అన్ని మండలాల్లోని ఆధార్ కేంద్రాల్లో ఈ సేవలు కొనసాగించాలని మహిళలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి.. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసుకోవాలి : అనిల్ సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.