ETV Bharat / state

వైకాపా మద్దతు ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Feb 4, 2021, 5:04 PM IST

సర్పంచి అభ్యర్థిత్వానికి వైకాపా మద్దతు ఇవ్వలేదని కనగానపల్లి మండలం శివపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

Woman commits suicide
మహిళ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 2న ఆమె సర్పంచి స్థానానికి నామినేషన్ వేశారు. కానీ స్థానిక వైకాపా నేతలు మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. దాంతో మొదట నామినేషన్ వేసిన మంజుల మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం శివపురం గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన వైకాపా మద్దతుదారు మంజుల పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 2న ఆమె సర్పంచి స్థానానికి నామినేషన్ వేశారు. కానీ స్థానిక వైకాపా నేతలు మరో మహిళతో నామినేషన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. దాంతో మొదట నామినేషన్ వేసిన మంజుల మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం ఆమెను అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఊరిపై మమకారం.. నిలిచింది పేరు చిరకాలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.