ETV Bharat / state

కరోనా రోగి ఇంట్లో చోరీ.. 3 లక్షలు అపహరణ

author img

By

Published : Aug 12, 2020, 4:36 PM IST

అనంతపురం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. కరోనా సోకిన వారి ఇంట్లోనూ దొంగతనానికి పాల్పడ్డారు. 3 లక్షల నగదుతో పాటు 8 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు.

theft in corona patient house in anantapur dst
theft in corona patient house in anantapur dst
కరోనా రోగి ఇంట్లో చోరీ..3లక్షలు అపహరణ

అనంతపురం జిల్లా కథల వీధికి చెందిన ఓ ఇంట్లో కరోనా రోగి మరణించిన కారణంగా.. బంధువులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. దుండగులు ఈ ఇంట్లోకి చొరబడి 3 లక్షల నగదుతో పాటు 8 తులాల బంగారు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల నివాసముంటున్న స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండవ పట్టణ సీఐ గోవిందు ఇంట్లోకి వెళ్లి చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను సేకరించి వీడియోకాల్ ద్వారా బాధితులతో మాట్లాడారు. పోయిన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

దశాబ్దాలుగా అడవి బిడ్డలకు తప్పని డోలీ కష్టాలు

కరోనా రోగి ఇంట్లో చోరీ..3లక్షలు అపహరణ

అనంతపురం జిల్లా కథల వీధికి చెందిన ఓ ఇంట్లో కరోనా రోగి మరణించిన కారణంగా.. బంధువులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. దుండగులు ఈ ఇంట్లోకి చొరబడి 3 లక్షల నగదుతో పాటు 8 తులాల బంగారు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల నివాసముంటున్న స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రెండవ పట్టణ సీఐ గోవిందు ఇంట్లోకి వెళ్లి చెల్లా చెదురుగా పడి ఉన్న వస్తువులను సేకరించి వీడియోకాల్ ద్వారా బాధితులతో మాట్లాడారు. పోయిన వస్తువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

దశాబ్దాలుగా అడవి బిడ్డలకు తప్పని డోలీ కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.