ETV Bharat / state

Ananthapuram students: విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. వారితో ఏం చేయించిందంటే?

author img

By

Published : Dec 6, 2021, 11:52 AM IST

Updated : Dec 6, 2021, 5:50 PM IST

building work with students: విద్యార్థుల భవిష్యత్, తద్వారా దేశ భవిష్యత్ తరగతి గదిలో నిర్మాణమవుతుందన్నాడో మహానుభావుడు. అయితే.. దాని సంగతి తర్వాత చూద్దాంగానీ.. ముందు తన ఇంటి నిర్మాణం పూర్తి చేద్దామని భావించిందో ఉపాధ్యాయురాలు! ఫ్రీగా పని చేయడానికొచ్చే విద్యార్థులుండగా.. కూలీలు ఎందుకు దండగా? అని అనుకుంది. వెంటనే ఆలోచనను ఆచరణలో పెట్టేసింది. పిల్లలను పిలిచి నెత్తిన తట్టలు పెట్టేసింది. అందులో.. ఇటుకలు పేర్చేసింది. మరి, తర్వాత ఏమైంది?

building work with students
building work with students

building work with students: చదువు విలువ ఏంటన్నది ఉపాధ్యాయులకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు. బాలలు బడిలో ఉండాలి తప్ప, పనిలో కాదని కూడా వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కానీ.. అనంతపురం జిల్లాలోని ఓ ఉపాధ్యాయురాలు మాత్రం మరో విధంగా ఆలోచించింది. విద్యార్థులందరినీ భవన నిర్మాణ కార్మికులుగా మార్చేసింది.

అనంతపురం గ్రామీణం మన్నీల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శివమ్మ నిర్వాకం ఇది. శివమ్మ.. అనంతపురంలోని ఆదర్శనగర్​లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. విద్యార్థులను పిలిపించి ఇటుకలు, సిమెంటు బస్తాలు మోయించారు. అంతేకాదు.. నగరపాలక సంస్థకు చెందిన చెత్త సేకరించే తోపుడుబండ్లను సైతం వినియోగించుకున్నారు.

ఎవ్వరూ చూడరులే అనుకున్నారో.. చూసినా ఎవరేం చేస్తారులే అనుకున్నారో తెలియదుగానీ.. దర్జాగా తన సొంత పని చేయించుకున్నారు. కొందరు జనాలు చూసీ చూడనట్టు వదిలేసినా.. సెల్ ఫోన్ కన్ను మాత్రం కనిపెట్టింది. టీచరమ్మ ఇంటి వద్ద నడిచిన సినిమా మొత్తం షూట్ చేసింది. సదరు వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. జనాలను దాటుకొని, అధికారు వద్దకూ సైతం వెళ్లింది.

ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్​ని వివరణ కోరగా.. తనకూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఈవో మీనాక్షి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పిన ఆయన.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి:

Man Attack On Woman: పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న మహిళపై యువకుడి చెప్పు దెబ్బ

building work with students: చదువు విలువ ఏంటన్నది ఉపాధ్యాయులకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదని చెప్పొచ్చు. బాలలు బడిలో ఉండాలి తప్ప, పనిలో కాదని కూడా వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కానీ.. అనంతపురం జిల్లాలోని ఓ ఉపాధ్యాయురాలు మాత్రం మరో విధంగా ఆలోచించింది. విద్యార్థులందరినీ భవన నిర్మాణ కార్మికులుగా మార్చేసింది.

అనంతపురం గ్రామీణం మన్నీల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న శివమ్మ నిర్వాకం ఇది. శివమ్మ.. అనంతపురంలోని ఆదర్శనగర్​లో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో.. విద్యార్థులను పిలిపించి ఇటుకలు, సిమెంటు బస్తాలు మోయించారు. అంతేకాదు.. నగరపాలక సంస్థకు చెందిన చెత్త సేకరించే తోపుడుబండ్లను సైతం వినియోగించుకున్నారు.

ఎవ్వరూ చూడరులే అనుకున్నారో.. చూసినా ఎవరేం చేస్తారులే అనుకున్నారో తెలియదుగానీ.. దర్జాగా తన సొంత పని చేయించుకున్నారు. కొందరు జనాలు చూసీ చూడనట్టు వదిలేసినా.. సెల్ ఫోన్ కన్ను మాత్రం కనిపెట్టింది. టీచరమ్మ ఇంటి వద్ద నడిచిన సినిమా మొత్తం షూట్ చేసింది. సదరు వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. జనాలను దాటుకొని, అధికారు వద్దకూ సైతం వెళ్లింది.

ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి శామ్యూల్​ని వివరణ కోరగా.. తనకూ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ డీఈవో మీనాక్షి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు చెప్పిన ఆయన.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి:

Man Attack On Woman: పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న మహిళపై యువకుడి చెప్పు దెబ్బ

Last Updated : Dec 6, 2021, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.