ETV Bharat / state

'సూచనలు పట్టించుకోకుండా చంద్రబాబునే విమర్శిస్తారా?'

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సూచనలు అందిస్తున్నా పట్టించుకోకుండా.. చంద్రబాబుపై విమర్శలు చేయటం వైకాపాకు సరికాదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. చంద్రబాబును తిడితే పదవుల పొడగింపు ఉంటుందన్న ఆలోచనతో మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడికి భారతీయులందరూ ఐక్యమవ్వాలని ప్రధాని మోదీ పిలుపు వైకాపా నాయకులకు నచ్చలేదని మరోనేత కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సాయమందించాలన్న ఆలోచన వైకాపా నేతలకు లేదన్నారు.

author img

By

Published : Apr 7, 2020, 10:15 AM IST

tdp leader venkata prasad fires on ycp govt
తెదేపా నేతలు
మీడియాతో కందికుంట వెంకటప్రసాద్

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందికి 20 లక్షల రూపాయలతో వివిధ రకాల సామగ్రిని పంపిణీ చేసినట్లు అనంతపురం జిల్లా కదిరి తెదేపా ఇన్​ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెప్పారు. పేదలకు సాయం చేసినా.. వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. తనను క్వారంటైన్ చేయించేందుకు అధికారులపై వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందన్న కనీస అవగాహన లేని వైకాపా నాయకుల తీరును ప్రజలు, అధికారులు తప్పుపడుతున్నారన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న సిద్ధాంతంతో ప్రతి తెదేపా కార్యకర్త ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు.

అవగాహన లేమితో చంద్రబాబుపై విమర్శలు

అవగాహనలేమితో చంద్రబాబుపై విమర్శలంటున్న జవహర్ నాయుడు

ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎదురుదాడి చేయడం సరికాదని మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి కరోనా గురించి చులకనగా, అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని చంద్రబాబు కోరడం తప్పా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను పొగిడిన వారు నేడు కేసులు ఇంతగా ఏవిధంగా పెరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని బృందం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో రెండేళ్లు మంత్రిగా కొనసాగవచ్చనే ఆలోచనతోనే చంద్రబాబుపై మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

'తెదేపా నేతలకు కరోనా వస్తే చెప్పండి.. వైద్యం అందిస్తాం'

మీడియాతో కందికుంట వెంకటప్రసాద్

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందికి 20 లక్షల రూపాయలతో వివిధ రకాల సామగ్రిని పంపిణీ చేసినట్లు అనంతపురం జిల్లా కదిరి తెదేపా ఇన్​ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చెప్పారు. పేదలకు సాయం చేసినా.. వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. తనను క్వారంటైన్ చేయించేందుకు అధికారులపై వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. స్వీయ నియంత్రణ ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందన్న కనీస అవగాహన లేని వైకాపా నాయకుల తీరును ప్రజలు, అధికారులు తప్పుపడుతున్నారన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అన్న సిద్ధాంతంతో ప్రతి తెదేపా కార్యకర్త ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తారని స్పష్టం చేశారు.

అవగాహన లేమితో చంద్రబాబుపై విమర్శలు

అవగాహనలేమితో చంద్రబాబుపై విమర్శలంటున్న జవహర్ నాయుడు

ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎదురుదాడి చేయడం సరికాదని మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రి కరోనా గురించి చులకనగా, అవగాహన లేమితో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను బహిర్గతం చేయాలని చంద్రబాబు కోరడం తప్పా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను పొగిడిన వారు నేడు కేసులు ఇంతగా ఏవిధంగా పెరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న పేర్నినాని, ఆళ్లనాని, కొడాలి నాని బృందం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరో రెండేళ్లు మంత్రిగా కొనసాగవచ్చనే ఆలోచనతోనే చంద్రబాబుపై మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

'తెదేపా నేతలకు కరోనా వస్తే చెప్పండి.. వైద్యం అందిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.