ETV Bharat / state

ఈతకు వెళ్లి.. బావిలో మునిగి బాలుడి మృతి - అనంతపురం జిల్లా బాలుడు మృతి తాజా వార్తలు

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గోనభావి గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Swim in the well and boy dead
బావిలో ఈతకు వెళ్ళి బాలుడు మృతి
author img

By

Published : Apr 10, 2020, 2:20 AM IST

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి గ్రామ సమీపంలో మణికంఠ(15) అనే బాలుడు వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత కొడుతూ బావిలో మునిగిపోయాడు. చాలా సేపటికీ బయటకు రాలేదు. స్నేహితులు, గ్రామ ప్రజలు బావిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సహకారంతో పోలీసులు బావిలో నీటిని తోడించారు. బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి గ్రామ సమీపంలో మణికంఠ(15) అనే బాలుడు వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత కొడుతూ బావిలో మునిగిపోయాడు. చాలా సేపటికీ బయటకు రాలేదు. స్నేహితులు, గ్రామ ప్రజలు బావిలో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సహకారంతో పోలీసులు బావిలో నీటిని తోడించారు. బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ప్రపంచవ్యాప్తంగా 15లక్షలు దాటిన కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.