ETV Bharat / state

పరీక్షల్లో తప్పానని రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Jan 14, 2021, 1:07 PM IST

పరీక్షల్లో తప్పానని ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది. రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న అశ్వక్.. ఇటీవలే వెల్లడైన పరీక్ష ఫలితాల్లో ఫెయిలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

student suicide at railway track in rayadurgam
రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో రైలు కింద పడి అశ్వక్​ (20) అనే డిగ్రీ విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అశ్వక్​ రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలే వెల్లడైన పరీక్ష ఫలితాల్లో అశ్వక్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుని తండ్రి అజ్మతుల్లా రాయదుర్గంలో మున్సిపల్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడి ఆత్మహత్యతో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు మైసూర్ డివిజన్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో రైలు కింద పడి అశ్వక్​ (20) అనే డిగ్రీ విద్యార్థి గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అశ్వక్​ రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలే వెల్లడైన పరీక్ష ఫలితాల్లో అశ్వక్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుని తండ్రి అజ్మతుల్లా రాయదుర్గంలో మున్సిపల్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేతికొచ్చిన ఒక్కగానొక్క కుమారుడి ఆత్మహత్యతో ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు మైసూర్ డివిజన్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మేకల మందపై కొండచిలువ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.