ETV Bharat / state

'రాజకీయ కక్షతోనే జేసీ ప్రభాకర్​పై అదనపు సెక్షన్లు'

author img

By

Published : Jun 13, 2020, 11:10 PM IST

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిపై రాజకీయ కక్షతోనే కొన్ని సెక్షన్లను చేర్చారని వారి తరఫు న్యాయవాది రవి కుమార్ వెల్లడించారు. ఈ కేసులతో వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

jc prabhakar
jc prabhakar

జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే కొన్నిసెక్షన్లను చేర్చారని జేసీ తరఫు న్యాయవాది రవికుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులతో ప్రభాకర్ రెడ్డికి, అస్మిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారిద్దరికీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం... న్యాయవాది రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తాడిపత్రిలోని 17 కేసులకు, అనంతపురంలోని 5 కేసులకు ముందస్తు బెయిల్ వచ్చిందని వెల్లడించారు. కానీ రెండు కేసులు మాత్రం రాజకీయ కక్షతోనే పెట్టారని అన్నారు. తమకు కోర్టులోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో రాజకీయ దురుద్దేశంతోనే కొన్నిసెక్షన్లను చేర్చారని జేసీ తరఫు న్యాయవాది రవికుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులతో ప్రభాకర్ రెడ్డికి, అస్మిత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారిద్దరికీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం... న్యాయవాది రవికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తాడిపత్రిలోని 17 కేసులకు, అనంతపురంలోని 5 కేసులకు ముందస్తు బెయిల్ వచ్చిందని వెల్లడించారు. కానీ రెండు కేసులు మాత్రం రాజకీయ కక్షతోనే పెట్టారని అన్నారు. తమకు కోర్టులోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.