ETV Bharat / state

బైక్​ను ఢీకొన్న టిప్పర్​.. రైల్వే ఉద్యోగి మృతి

author img

By

Published : Dec 14, 2022, 2:13 PM IST

Road Accident In Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యానగర్ కాలనీలో టిప్పర్​ని బైక్ ఢీకొంది. ఈ సంఘటనలో రైల్వే ఉద్యోగి ఓబులపతి మృతి చెందగా, మరొక ఉద్యోగి షేక్షవాలికి గాయాలయ్యాయి.

బైక్ ను ఢీ కొన్న టిప్పర్
Road accident

Road Accident In Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యానగర్ కాలనీలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగి ఓబుళపతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి షేక్షావలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు భాగ్యనగర్​లో నివసిస్తున్న ఓబుళపతి, షేక్షావలి ఇరువురు కలిసి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని దేవనహళ్లి రైల్వే స్టేషన్​లో ట్రాక్​మెన్​గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఉదయం బైక్​లో వెళ్తుండగా ఆలూరు వైపు నుంచి గుంతకల్లు వస్తున్న టిప్పర్ బైకు ఢీకొంది. షేక్షావలిని చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రామసుబ్బయ్య పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై గుంతకల్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓబుళపతి మృతదేహాన్ని గుంతకల్ ప్రభుత్వ తరలించారు.

Road Accident In Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యానగర్ కాలనీలో ద్విచక్రవాహనాన్ని టిప్పర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైల్వే ఉద్యోగి ఓబుళపతి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి షేక్షావలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంతకల్లు భాగ్యనగర్​లో నివసిస్తున్న ఓబుళపతి, షేక్షావలి ఇరువురు కలిసి గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని దేవనహళ్లి రైల్వే స్టేషన్​లో ట్రాక్​మెన్​గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఉదయం బైక్​లో వెళ్తుండగా ఆలూరు వైపు నుంచి గుంతకల్లు వస్తున్న టిప్పర్ బైకు ఢీకొంది. షేక్షావలిని చికిత్స నిమిత్తం గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ రామసుబ్బయ్య పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై గుంతకల్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓబుళపతి మృతదేహాన్ని గుంతకల్ ప్రభుత్వ తరలించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.