ETV Bharat / state

చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేశారంటూ తెదేపా అభ్యర్థి అందోళన - కదిరి మున్సిపాలిటీ ఉద్రిక్తత

కదిరి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేసి ఆ పార్టీని విజేతగా ప్రకటించారంటూ తెదేపా అభ్యర్థి ఆందోళన చేపట్టారు.

protest
చెల్లని ఓటు వైకాపా ఖాతాలో వేశారంటూ తెదేపా అభ్యర్థి అందోళన
author img

By

Published : Mar 14, 2021, 4:44 PM IST

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 29వ వార్డులో చెల్లని ఓటును వైకాపా ఖాతాలో వేస్తూ ఆ పార్టీ గెలిచినట్లు ప్రకటించారని తెదేపా అభ్యర్థి ఇర్ఫాన్ కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు . తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తెదేపా నేతను లెక్కింపు కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారంటూ వైకాపా శ్రేణులు ప్రశ్నించాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 29వ వార్డులో చెల్లని ఓటును వైకాపా ఖాతాలో వేస్తూ ఆ పార్టీ గెలిచినట్లు ప్రకటించారని తెదేపా అభ్యర్థి ఇర్ఫాన్ కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు . తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తెదేపా నేతను లెక్కింపు కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారంటూ వైకాపా శ్రేణులు ప్రశ్నించాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి: హిందూపురం మున్సిపాలిటీ వైకాపా వశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.