అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. 29వ వార్డులో చెల్లని ఓటును వైకాపా ఖాతాలో వేస్తూ ఆ పార్టీ గెలిచినట్లు ప్రకటించారని తెదేపా అభ్యర్థి ఇర్ఫాన్ కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నాకు దిగారు . తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తెదేపా నేతను లెక్కింపు కేంద్రంలోకి ఎలా అనుమతిస్తారంటూ వైకాపా శ్రేణులు ప్రశ్నించాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చదవండి: హిందూపురం మున్సిపాలిటీ వైకాపా వశం