ETV Bharat / state

కలుషిత నీటి సరఫరా.. ఆందోళనలో పట్టణ వాసులు

author img

By

Published : Sep 3, 2020, 10:07 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో సరఫరా అవుతున్న మంచి నీరు కలుషితంగా మారి తాగేందుకు పనికి రాకుండా ఉందంటూ పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

polluted water distribution in thadipathri ananthapuram district
ఉరవకొండలో సరఫరా అవుతోన్న మంచినీరు

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పది రోజులుగా తాగునీరు రాక పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. గురువారం వచ్చిన నీరు కలుషితంగా ఉండి తాగేందుకూ పనికి రాకుండా ఉందన్నారు.

ఈ నీటిని తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. శుద్ధమైన నీటిని సరఫరా చేయాలన్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. పది రోజులుగా తాగునీరు రాక పట్టణ వాసులు అవస్థలు పడుతున్నారు. గురువారం వచ్చిన నీరు కలుషితంగా ఉండి తాగేందుకూ పనికి రాకుండా ఉందన్నారు.

ఈ నీటిని తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటూ ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. శుద్ధమైన నీటిని సరఫరా చేయాలన్నారు.

ఇదీ చదవండి:

సాగులో సందేహమా? అయితే 155251కు ఫోన్‌ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.