అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో.. నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని గుత్తి సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
బిందెలు, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 2,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఇదీ చదవండి: