అనంతపురంలోకి మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. తరుచూ ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తూ.. అక్రమాలను అడ్డుకుంటున్నామన్నారు. జిల్లాలోకి ప్రవేశించే, ఫ్యాక్షన్ సమస్యాత్మక గ్రామాలకు వెళ్లొచ్చే రహదారులు, పట్టణ శివారు ప్రాంతాల జంక్షన్లలో.. ఈ కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతున్నామని పేర్కొన్నారు.
![vehicle checking by police and seb](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-atp-13-10-police-checking-vehicles-ph-ap10001_10122020161645_1012f_1607597205_960.jpg)
మారణాయుధాలు, పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నారేమో అనే కోణంలో.. గత నెలలో 1,652 వాహనాలను తనిఖీ చేశామని పోలీసులు వివరించారు. ఎస్ఈబీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా.. ఏకకాలంలో నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశాల మేరకు 8 సబ్ డివిజన్ల పోలీసులు, 2 ఎస్ఈబీ డివిజన్ల అధికారులు బృందాలుగా ఏర్పడి.. కర్ణాటక మద్యం, నాటు సారా రవాణా జరగకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: