సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా అనంతపురం జిల్లా గుత్తిలో ఎంతో మంది యాచకులు, నిరాశ్రయులు ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు. వందమందికి ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లను అందజేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఎస్ఐ గోపాలుడుతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: