అనంతపురం జిల్లా గుడిబండ మండలం గుడిదహళ్లి గ్రామ అటవీ ప్రాంతంలోని నాటు సారా తయారీ కేంద్రాలపై స్థానిక ఎస్సైతో పాటు సీఐ రాజేంద్ర ప్రసాద్ దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన తయారీదారులు అక్కడి నుంచి ఉడాయించారు.
తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లం ఊట పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే... కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి