ETV Bharat / state

మామిడూరులో 60 మామిడి చెట్లు నరికేసిన దుండగులు - అనంతపురం జిల్లా మామిడూరు తాజా వార్తలు

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామంలో ఓ రైతు పొలంలో మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మామిడూరులో 60 మామిడి చెట్లు నరికేసిన దుండగలు
మామిడూరులో 60 మామిడి చెట్లు నరికేసిన దుండగలు
author img

By

Published : Nov 9, 2020, 4:49 PM IST




ఓ రైతు ఎంతో శ్రద్దగా పెంచుకుంటున్న మామిడి చెట్లను దుండగులు నరికి వేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన పొలంలో వందకుపైగా మామిడి చెట్లను నాటుకున్నాడు. అయితే మామిడి చెట్ల మధ్య అంతర పంటగా శనగ పంట వేసి ఇటీవలే పూర్తిగా నష్టపోయాడు. ఇప్పడు తన మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ మామిడి చెట్లను నరికి వేయడానికి ఆస్తి తగాదాలు కారణమా, మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




ఓ రైతు ఎంతో శ్రద్దగా పెంచుకుంటున్న మామిడి చెట్లను దుండగులు నరికి వేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామానికి చెందిన రైతు సుధాకర్ తన పొలంలో వందకుపైగా మామిడి చెట్లను నాటుకున్నాడు. అయితే మామిడి చెట్ల మధ్య అంతర పంటగా శనగ పంట వేసి ఇటీవలే పూర్తిగా నష్టపోయాడు. ఇప్పడు తన మామిడి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి వేశారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ మామిడి చెట్లను నరికి వేయడానికి ఆస్తి తగాదాలు కారణమా, మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

ఆడుకుంటూ కిందపడి తొమ్మిది నెలల చిన్నారి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.