ETV Bharat / state

మానువల్ మారథాన్...పేదింట్లో వెలుగులు విరబూసెన్ ! - అనంతపురంలో మానువల్ మారథాన్

జువాన్ మానువల్... ఇతను ఒక్కసారి పరుగు నిర్వహిస్తే కొందరి పేదల జీవితాల్లో వెలుగులు విరబూస్తాయి. పరుగుకు పేదల జీవితాలకు సంబంధం ఏంటని సందేహిస్తున్నారా..? అక్కడికే వస్తున్నా... స్పెయిన్ దేశానికి చెందిన మారథాన్ వీరుడు జువాన్ అభాగ్యులకు అండగా నిలవాలన్న సంకల్పంతో గత కొన్నేళ్లుగా అనంతపురంలో మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ పరుగు ద్వారా విరాళాలు సేకరించి పేద ప్రజలకు పక్కా ఇళ్లతోపాటు, అనాథలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు.

మానువల్ మారథాన్
మానువల్ మారథాన్
author img

By

Published : Jan 27, 2020, 7:38 PM IST

2015లో తొలిసారిగా అనంతపురంలో జువాన్ అల్ట్రా మారథాన్ పరుగును నిర్వహించారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం, నాయనపల్లి గ్రామ సమీపంలో ప్రారంభమైన ఈ పరుగు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి వరకు 150 కి.మీ సాగింది. ఈసందర్భంగా కిలోమీటర్​కు ఒకర్ని చొప్పున అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన చదువు, వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. మొత్తం 150 మంది దాతలను పరిచయం చేసింది ఈ పరుగు.
2017లో 170 కిలోమీటర్ల మారథాన్ చేపట్టారు. ఈ పరుగులో 24 మంది స్పెయిన్ , స్థానిక క్రీడాకారులు పాల్గొని 20 లక్షల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని దివ్యాంగుల వైద్య పరీక్షల పునరావాసం కోసం ఖర్చు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆధునిక పరికరాలను కొనుగోలు చేశారు.
2018లో ముచ్చటగా మూడోసారి పరిగి మండలం ఎర్రగుంట్లలో పరుగును ప్రారంభించారు. 170 కి.మీ. నిర్వహించిన ఈ పరుగులో ఆర్డీటీ దత్తత గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ మారథాన్ ద్వారా 43 మందికి పక్కా గృహాలు నిర్మించారు.
2019లో నాలుగో ఆల్ట్రా మారథాన్ పరుగును నల్లమడ మండలం, సుందరయ్య కాలనీలో నిర్వహించారు. గుడిసెల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మొత్తం 45 మందికిల ఈ పరుగుద్వారా ఇల్లు నిర్మించారు.
నిన్న చేపట్టిన ఐదో పరుగు ద్వారా శ్రీశైలంలోని 39 మంది చెంచు కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికి అవసరమైన మొత్తం నిధులను పరుగు ద్వారా సేకరిస్తారు. ఈసారి పరుగు ఆర్డీటీ ప్రధాన కార్యాలయం నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ప్రాంగణంలోని ఫెర్రర్ ఘాట్ వరకు 170 కి.మీ కొనసాగింది. ఈ పరుగులో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

మానువల్ మారథాన్

2015లో తొలిసారిగా అనంతపురంలో జువాన్ అల్ట్రా మారథాన్ పరుగును నిర్వహించారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం, నాయనపల్లి గ్రామ సమీపంలో ప్రారంభమైన ఈ పరుగు బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి వరకు 150 కి.మీ సాగింది. ఈసందర్భంగా కిలోమీటర్​కు ఒకర్ని చొప్పున అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన చదువు, వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. మొత్తం 150 మంది దాతలను పరిచయం చేసింది ఈ పరుగు.
2017లో 170 కిలోమీటర్ల మారథాన్ చేపట్టారు. ఈ పరుగులో 24 మంది స్పెయిన్ , స్థానిక క్రీడాకారులు పాల్గొని 20 లక్షల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని దివ్యాంగుల వైద్య పరీక్షల పునరావాసం కోసం ఖర్చు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆధునిక పరికరాలను కొనుగోలు చేశారు.
2018లో ముచ్చటగా మూడోసారి పరిగి మండలం ఎర్రగుంట్లలో పరుగును ప్రారంభించారు. 170 కి.మీ. నిర్వహించిన ఈ పరుగులో ఆర్డీటీ దత్తత గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈ మారథాన్ ద్వారా 43 మందికి పక్కా గృహాలు నిర్మించారు.
2019లో నాలుగో ఆల్ట్రా మారథాన్ పరుగును నల్లమడ మండలం, సుందరయ్య కాలనీలో నిర్వహించారు. గుడిసెల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మొత్తం 45 మందికిల ఈ పరుగుద్వారా ఇల్లు నిర్మించారు.
నిన్న చేపట్టిన ఐదో పరుగు ద్వారా శ్రీశైలంలోని 39 మంది చెంచు కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికి అవసరమైన మొత్తం నిధులను పరుగు ద్వారా సేకరిస్తారు. ఈసారి పరుగు ఆర్డీటీ ప్రధాన కార్యాలయం నుంచి బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రి ప్రాంగణంలోని ఫెర్రర్ ఘాట్ వరకు 170 కి.మీ కొనసాగింది. ఈ పరుగులో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

మానువల్ మారథాన్

ఇదీచదవండి

సాక్షి దినపత్రికపై లోకేశ్ ప‌రువు న‌ష్టం దావా

Intro:ATP :- జువాన్ మానువల్ ఇతను ఒక్కసారి పరుగు నిర్వహిస్తే కొందరి పేదల జీవితాల్లో వెలుగులు విరబూస్తాయి. పరుగుకు పేదల జీవితాలకు సంబంధం ఏంటని సందేహిస్తున్నారు..! స్పెయిన్ దేశానికి చెందిన మారథాన్ వీరుడు జువాన్ మానువల్ పరుగుకు ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా 50 ఏళ్ల కిందట అనంతపురం జిల్లాలో ఆర్డిటి వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, ఆయన సతీమణి అనే ఫెర్రర్ కరువు నేలపై అడుగు పెట్టారు. జనవరి 24, 1969 న ఆ దంపతులు అనంతపురంలో అడుగిడారు. వారి బాటలోనే నడవాలని మంచి సంకల్పంతో అదే రోజున జువాన్ మారథాన్ పరుగు నిర్వహించి పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. పేదరికాన్ని రూపుమాపాలని ఫాదర్ ఫెర్రర్ కళలను సహకారం చేస్తున్నారు. ఎక్కడో పుట్టి ఇక్కడి పేద ప్రజలపై ఆయన ఎంతో మమకారం చూపిస్తున్నారు. గతంలోనూ నాలుగు పర్యాయాలు నిర్వహించిన పరుగు కార్యక్రమాల్లో పేద ప్రజల కోసం అమలు చేసిన అంశాలు ఇలా...


1... 2015లో తొలిసారిగా జిల్లాలో అల్ట్రా మారథాన్ పరుగులో నిర్వహించారు. జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం, నాయనపల్లి గ్రామ సమీపంలో ప్రారంభమైన ఈ పరుగు బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి వరకు 150 కి.మీ సాగింది. కిలోమీటర్ కు ఒకర్ని చొప్పున అనాథ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన చదువు, వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. ఆర్డిటి అమలుచేసే పథకాలు అన్ని వర్తిస్తాయి. మొత్తం 150 మంది దాతల ను పరిచయం చేసింది ఈ పరుగు.

2... 2017 లో మారథాన్ పరుగు చేపట్టి 170 కిలోమీటర్లు పరుగు లో భాగంగా 24 మంది స్పెయిన్ స్థానిక క్రీడాకారులు పాల్గొని 20 లక్షల విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని దివ్యాంగుల వైద్య పరీక్షల పునరావాసం కోసం ఖర్చు చేశారు. వైద్య పరీక్షల కోసం ఆధునిక పరికరాలను కొనుగోలు చేశారు.

3... 2018లో ముచ్చటగా మూడోసారి పరుగులు.. పరిగి మండలం, ఎర్రగుంట్ల గ్రామంలో ప్రారంభించి 170 కి.మీ. నిర్వహించారు. ఈ పరుగులో భాగంగా ఆర్డిటి దత్తత గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. 43 మందికి పక్కా గృహాలు నిర్మించారు.




Body:4... నాలుగో ఆల్ట్రా మారథాన్ పరుగు నల్లమడ మండలం, సుందరయ్య కాలనీలో నిర్వహించారు. గుడిసెల్లో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మొత్తం 45 మందికి ఇల్లు నిర్మించారు.

*..5... ఇవాళ అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదో పరుగు ద్వారా శ్రీశైలంలోని 39 మంది చెంచు కుటుంబాలకు ఒకొక్కరికి పక్కా ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికి అవసరమైన మొత్తం నిధులను ఈ పరుగు ద్వారా సేకరిస్తారు. ఈసారి జువాన్ పరుగు అనంతపురం ఆర్ డి టి ప్రధాన కార్యాలయం నుంచి బత్తలపల్లి ఆర్డిటి ఆస్పత్రి ప్రాంగణంలోని ఫెర్రర్ ఘాట్ వరకు 170 కి.మీ కొనసాగనుంది. ఈ పరుగులో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

బైట్..... మంచో ఫెర్రర్, ఆర్డీటీ డైరెక్టర్ అనంతపురంజిల్లా.


Conclusion:సార్ :- రిపోర్టర్ ప్రజెంటేషన్ ఇచ్చాము. పరిశీలించగలరు.

అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

ఈజేఎస్ :- సందీప్ వర్మ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.