ETV Bharat / state

'విశాఖలో రాజధాని వెనుక మతలబు ఏంటి..?' - వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి

శాసన మండలిని రద్దు చేసినా భయపడే ప్రసక్తే లేదని తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి స్పష్టం చేశారు. తమకు పదవుల కంటే, ప్రజాశ్రేయస్సే ముఖ్యం అని పేర్కొన్నారు.

tdp mlc fires on ycp govt
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి
author img

By

Published : Jan 25, 2020, 8:12 PM IST

'విశాఖలో రాజధాని వెనుక మతలబు ఏంటి..?'

తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాసనమండలి రద్దు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీకి ప్రధాన మార్గం నుంచి కాకుండా వేరే మార్గంలో వచ్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు గౌరవం ఇచ్చే పార్టీ వైకాపా అని గొప్పలు చెప్పేవారు... శాసన మండలి ఛైర్మన్ షరిఫ్​ను దుర్భాషలాడారని ఆరోపించారు.

కర్నూలుకు హైకోర్టు ప్రకటించి రాయలసీమ ప్రజలను మోసగించారని తిప్పేస్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధానిగా ఒక ప్రాంతాన్నే చెప్పాలనీ, 3 ప్రాంతాలు చెప్పటం ఎక్కడా లేదని పేర్కొన్నారు. విశాఖలో రాజధాని వద్దని ఆ ప్రాంత ప్రజలు తిరస్కరిస్తున్నా... అక్కడ రాజధాని పెట్టటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. రాయలసీమలో రాజధాని పెడితే తాము హర్షిస్తామన్నారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'ఆస్తులు పెంచుకునేందుకే వైకాపా, తెదేపా నేతల ప్రయత్నం'

'విశాఖలో రాజధాని వెనుక మతలబు ఏంటి..?'

తెదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాసనమండలి రద్దు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. తమకు ప్రజాశ్రేయస్సే ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి, మంత్రులు అసెంబ్లీకి ప్రధాన మార్గం నుంచి కాకుండా వేరే మార్గంలో వచ్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు గౌరవం ఇచ్చే పార్టీ వైకాపా అని గొప్పలు చెప్పేవారు... శాసన మండలి ఛైర్మన్ షరిఫ్​ను దుర్భాషలాడారని ఆరోపించారు.

కర్నూలుకు హైకోర్టు ప్రకటించి రాయలసీమ ప్రజలను మోసగించారని తిప్పేస్వామి ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రాజధానిగా ఒక ప్రాంతాన్నే చెప్పాలనీ, 3 ప్రాంతాలు చెప్పటం ఎక్కడా లేదని పేర్కొన్నారు. విశాఖలో రాజధాని వద్దని ఆ ప్రాంత ప్రజలు తిరస్కరిస్తున్నా... అక్కడ రాజధాని పెట్టటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. రాయలసీమలో రాజధాని పెడితే తాము హర్షిస్తామన్నారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'ఆస్తులు పెంచుకునేందుకే వైకాపా, తెదేపా నేతల ప్రయత్నం'

Intro:శాసనమండలిని రద్దు చేసిన భయపడే ప్రసక్తే లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో తేదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం శాసన మండలి సభ్యులను తిప్పుకోవడానికి మండలిని రద్దు చేస్తాం అంటూ భయాలు సృష్టిస్తున్నారు. ఒకవేళ మండలి రద్దు చేసిన భయపడే ప్రసక్తే లేదు. మాకు ప్రజా శ్రేయస్సే ముఖ్యం.
ప్రజాగ్రహానికి భయపడి పదివేల మంది పోలీసు బలగంతో దొడ్డిదారిన మంత్రులు ముఖ్యమంత్రులు అసెంబ్లీకి వచ్చారు.

మైనారిటీలకు గౌరవించేది వైసిపి పార్టీ అంటూ గొప్పలు చెప్పే వారు శాసనమండలి చైర్మన్ షరీఫ్కు దుర్భాషలాడి మతం పేరుతో దారుణంగా దూషించారు.


Conclusion:కర్నూలుకు కేవలం హైకోర్టు బెంచ్ ప్రకటించి రాయలసీమ ప్రజలను మోసగించారు. బిడ్డకు తండ్రి పేరు అడిగితే ఒకటే పేరు తెలుపుతాడు. అలాగే రాష్ట్రానికి రాజధాని పేరు ఒకటే చెప్పాలి. మూడు పేర్లు చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. మా ప్రాంతం అభివృద్ధి చెందింది మాకు రాజధాని వద్దంటూ విశాఖ ప్రజలు తిరస్కరించిన అక్కడే రాజధాని ప్రకటించడం వాటి వెనుక గల కుట్ర ఏమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


బైట్స్ : గుండుమల తిప్పేస్వామి, తేదేపా ఎమ్మెల్సీ, మడకశిర.



యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్. : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.