లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బార్ అండ్ రెస్టారెంట్ను తెరిచిన నిర్వాహకులపై అనంతపురం జిల్లా గుంతకల్లు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం బార్లు, మద్యం దుకాణాలను తాత్కాలికంగా సీజ్ చేయగా...గంతకల్లులోని ఎస్వీ బార్ నిర్వాహకులు మాత్రం అధికారులు వేసిన సీల్ను ట్యాంపర్ చేశారు. తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు...సీల్ను తొలగించినట్లు గుర్తించారు. అనంతరం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
ఇదీచదవండి