ETV Bharat / state

కార్మిక శాఖ కార్యాలయం వద్ద మహిళల నిరసన

author img

By

Published : Nov 14, 2020, 6:28 PM IST

అనంతపురం జిల్లాలోని వస్త్ర పరిశ్రమల మహిళా కార్మికులు నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి.. ఆయా సంస్థల ముందు నిరసనకు దిగారు. యాజమాన్యాలు స్పందించకపోవడంతో.. హిందూపురంలోని కార్మికశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.

lady workers protest
ఆందోళన నిర్వహిస్తున్న మహిళా కార్మికులు

మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ.. అనంతపురం జిల్లా హిందూపురంలోని కార్మిక శాఖ కార్యాలయం ముందు సీపీఎం ఆందోళన నిర్వహించింది. గత నాలుగు రోజులుగా ఆ పార్టీ మద్ధతుతో.. పరిగిలోని ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్, నిషా గార్మెంట్స్ వద్ద మహిళా సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో.. కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులతో చర్చించిన అధికారులు.. సమస్య పరిష్కారానికి ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడాలనే ఆలోచనో ఉన్నారని సమాచారం.

మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని, బోనస్ ఇవ్వాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ.. అనంతపురం జిల్లా హిందూపురంలోని కార్మిక శాఖ కార్యాలయం ముందు సీపీఎం ఆందోళన నిర్వహించింది. గత నాలుగు రోజులుగా ఆ పార్టీ మద్ధతుతో.. పరిగిలోని ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్, నిషా గార్మెంట్స్ వద్ద మహిళా సిబ్బంది విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. యాజమాన్యం స్పందించకపోవడంతో.. కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులతో చర్చించిన అధికారులు.. సమస్య పరిష్కారానికి ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడాలనే ఆలోచనో ఉన్నారని సమాచారం.

ఇదీ చదవండి: గర్భిణికి చికిత్స అందించలేదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.