ETV Bharat / state

దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెండో కిసాన్ రైలు - అనంతపురం నుంచి దిల్లీకి కిసాన్ రైలు తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో ఉద్యాన ఉత్పత్తులతో రెండో కిసాన్ రైలు దిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. రైతులు ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు వ్యాగన్లలో లోడ్ చేస్తున్నారు. ఈసారి కిసాన్ రైలు ద్వారా 10 వ్యాగన్లు దిల్లీకి, 2 వ్యాగన్లు నాగపూర్ ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు.

కిసాన్ రైలు
కిసాన్ రైలు
author img

By

Published : Sep 19, 2020, 9:22 PM IST

240 మెట్రిక్ టన్నుల టమోటా, బొప్పాయి, మామిడి, దానిమ్మ ఉత్పత్తులను కిసాన్​ రైలు ద్వారా రవాణా చేయనునున్నట్లు అధికారులు చెప్పారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కిసాన్ రైలును పరిశీలించారు. రవాణాకు సంబంధించి రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయని త్వరలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కంటే కిసాన్ రైలు ద్వారా తరలించడం రైతులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

240 మెట్రిక్ టన్నుల టమోటా, బొప్పాయి, మామిడి, దానిమ్మ ఉత్పత్తులను కిసాన్​ రైలు ద్వారా రవాణా చేయనునున్నట్లు అధికారులు చెప్పారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కిసాన్ రైలును పరిశీలించారు. రవాణాకు సంబంధించి రైతులకు కొన్ని సమస్యలు ఉన్నాయని త్వరలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కంటే కిసాన్ రైలు ద్వారా తరలించడం రైతులకు కాస్త ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

ఇదీ చదవండి: 'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.