ETV Bharat / state

అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసిన చిన్నారులకు అస్వస్థత

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని పాముదుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

author img

By

Published : Mar 20, 2021, 1:14 PM IST

Illness of children
అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసిన చిన్నారులకు అస్వస్థత
అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసిన చిన్నారులకు అస్వస్థత

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కార్యకర్త చేసిన పులిహోర, ఉడకబెట్టిన కోడిగుడ్లు చిన్నారులు తిన్నారు. భోజనం చేసిన ఆరుగురు పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది... వారిని పాముదుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ముగ్గురు చిన్నారులను కదిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో ముగ్గురిని కొత్తచెరువు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.

ఇదీ చదవండి: వివాహాలు, వేడుకల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కొవిడ్‌ కేసులు

అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేసిన చిన్నారులకు అస్వస్థత

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం బిట్రగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆహారం తిన్న పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కార్యకర్త చేసిన పులిహోర, ఉడకబెట్టిన కోడిగుడ్లు చిన్నారులు తిన్నారు. భోజనం చేసిన ఆరుగురు పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది... వారిని పాముదుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు ముగ్గురు చిన్నారులను కదిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో ముగ్గురిని కొత్తచెరువు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.

ఇదీ చదవండి: వివాహాలు, వేడుకల్లో పాల్గొని వచ్చిన వారిలోనే కొవిడ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.