ETV Bharat / state

చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ..

author img

By

Published : Jan 22, 2021, 3:17 PM IST

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో గుర్తుతెలియని దుండగులు హుండీ చోరీ చేశారు. గుడిలో తలుపులు పగలగొట్టిన దొంగలు.. హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

hiundi theft in maramma temple at cheruvu mundara thanda
చెరువు ముందర తండా మారమ్మ ఆలయంలో హుండీ చోరీ

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో హుండీ చోరీకి గురైంది. గ్రామానికి సమీపంలోని మారమ్మ గుడిలో తలుపులు పగలగొట్టిన దుండగులు హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి చెరువు ముందర తాండాకు వెళ్లి గుడిని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు.

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం చెరువు ముందర తండాలోని మారమ్మ గుడిలో హుండీ చోరీకి గురైంది. గ్రామానికి సమీపంలోని మారమ్మ గుడిలో తలుపులు పగలగొట్టిన దుండగులు హుండీని అపహరించుకు వెళ్లారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి గ్రామీణ సీఐ మధు, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి చెరువు ముందర తాండాకు వెళ్లి గుడిని పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు.

ఇదీ చదవండి: నడుచుకుంటూ వెళ్తే ఆపరు అనుకున్నాడేమో..! గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.