ETV Bharat / state

బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు - బాచుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్

అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. భర్తతో పాటు 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

anantapuram district gutthi police solved bachupalli murder case
author img

By

Published : Oct 18, 2019, 9:39 AM IST

బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు..

అదనపు కట్నం కోసం భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. గత వారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లిలో ఈ నెల 11 వ తేదీన చెంచులక్ష్మి అనే మహిళ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించి భర్తే గొంతు నులిమి చంపినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు వారంలోపే నిందితులను పట్టుకున్నారు. భర్తతో పాటు 9 మంది నిందితులను గుత్తి పోలీసులు రిమాండ్​కు తరలించారు. కట్నంగా తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ మాట్లాడుతూ.. గొంతు నులిమి చంపి.. ఏమీ తెలియనట్లుగా విషపు గుళికలు మింగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారనన్నారు. నిందితుల్లో ఒక మైనర్​ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి.జమ్మలమడుగులో విజిలెన్స్ దాడులు.... 100 సబ్సిడీ విత్తనాల బస్తాలు సీజ్

బాచుపల్లి హత్య కేసును ఛేదించిన గుత్తి పోలీసులు..

అదనపు కట్నం కోసం భర్తే భార్యను కడతేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. గత వారం అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లిలో ఈ నెల 11 వ తేదీన చెంచులక్ష్మి అనే మహిళ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధించి భర్తే గొంతు నులిమి చంపినట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు వారంలోపే నిందితులను పట్టుకున్నారు. భర్తతో పాటు 9 మంది నిందితులను గుత్తి పోలీసులు రిమాండ్​కు తరలించారు. కట్నంగా తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి డీఎస్పీ మాట్లాడుతూ.. గొంతు నులిమి చంపి.. ఏమీ తెలియనట్లుగా విషపు గుళికలు మింగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారనన్నారు. నిందితుల్లో ఒక మైనర్​ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచూడండి.జమ్మలమడుగులో విజిలెన్స్ దాడులు.... 100 సబ్సిడీ విత్తనాల బస్తాలు సీజ్

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 17-10-2019 Slug:AP_Atp_23_17_bachupali_criminals_remand_Avb_ap10176 anchor:-అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తే..భార్యను.. కడ తేర్చిన ఘటనను గుత్తి పోలీసులు ఛేదించారు. గత వారం అనంతపురం జిల్లా,గుత్తి మండలo బాచుపల్లి లో 11 వ తేదీన హత్యకు గురైన చెంచులక్ష్మి ను అదనపు కట్నం కోసం వేధించి గొంతు నులిమి చంపిన భర్త తో పాటు 9 మంది నింధితులను గుత్తి పోలీసులు రిమాండ్ కు తరలించారు.మృతురాలి తల్లి తమకు న్యాయం చేసి నిందుతులని కఠినముగా శిక్షించాలని కోరడంతో సీరియస్ గా తీసుకున్న గుత్తి పోలీసులు వారం లోపే నిందుతులను పట్టుకుని వారి నుండి కట్నం గా తీసుకున్న ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.తాడిపత్రి డి.ఎస్.పి తెలిపిన వివరాల మేరకు నిందుతులు భార్యను గొంతు నులిమి చంపి ఏమి తెలియానట్లుగా విషపు గుళికలు మింగిందని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని తమ విచారణ లో తెలిసిందని అన్నారు.8 మంది నిందులను తహశీలదార్ ఎదుట హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.మరొక నిందుతుడు మైనర్ కావడంతో జిల్లా కర్మాగారం కు తెరలించామని అన్నారు. బైట్:- శ్రీనివాస రెడ్డి, డి.ఎస్.పి తాడిపత్రి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.