ETV Bharat / state

రివర్స్ టెండరింగ్​తో రూ.700 కోట్లు ఆదా: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి - Government Chief Whip Srikanth Reddy examines the main canal works of Handriniva in Kadari constituency

కదిరి నియోజక వర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. జనవరి నాటికి రాయలసీమ జిల్లాలలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామన్నారు.

the main canal works of Handriniva in Kadari constituency
author img

By

Published : Sep 26, 2019, 5:50 PM IST

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700కోట్లు ఆదా..ప్రభుత్వ చీఫ్ విప్

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 14, 15వ ప్యాకేజీల కింద జరుగుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను ఆయన పరిశీలించారు. కదిరి మండలం పట్నం వద్ద మద్దిలేటి వాగుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులతో పాటు చెరువులకు నీటిని వదిలేందుకు అనువైన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. తలుపుల మండలం సబ్బంగుంతపల్లి వద్ద ఆగిపోయిన సొరంగం పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి జనవరిలో కృష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు. జలయజ్ఞం పేరుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి లెక్కకు మించిన ప్రాజెక్టులను మొదలుపెట్టి పూర్తి చేశారన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రెండు పనులలోనే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలను ఆదా చేసిన విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు జీర్ణించుకోవడం లేదన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700కోట్లు ఆదా..ప్రభుత్వ చీఫ్ విప్

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 14, 15వ ప్యాకేజీల కింద జరుగుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను ఆయన పరిశీలించారు. కదిరి మండలం పట్నం వద్ద మద్దిలేటి వాగుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులతో పాటు చెరువులకు నీటిని వదిలేందుకు అనువైన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. తలుపుల మండలం సబ్బంగుంతపల్లి వద్ద ఆగిపోయిన సొరంగం పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి జనవరిలో కృష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు. జలయజ్ఞం పేరుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి లెక్కకు మించిన ప్రాజెక్టులను మొదలుపెట్టి పూర్తి చేశారన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రెండు పనులలోనే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలను ఆదా చేసిన విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు జీర్ణించుకోవడం లేదన్నారు.

ఇదీ చూడండి

'సచివాలయ ఉద్యోగాల్లో అవతవకల్లేవ్‌'

Intro:కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం పరిధిలోని గోవిందం పల్లి ,బిపి రాచపల్లి వెళ్లే దారి అడ్డగించిన గ్రామస్తులు వాటి వివరాలు.


Body:కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట సమీపంలో ఉన్న గోవిందం పల్లి, బిపి రాచపల్లి, వాటి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈరోజు రోడ్డుపై బైఠాయించారు. ఆ దారిలో వచ్చే వాహనాలను అడ్డుకున్నారు . ఆ గ్రామాల సమీపం లో ఉన్న ముగ్గురాయి మిల్లుకు తోలే లారీలు రావడం వల్ల ఏర్పడే దుమ్ము ధూళి దగ్గర్లో ఉన్న గ్రామాలపై పడి అక్కడ నివసిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆ ప్రజలు తెలిపారు. అంతేకాకుండా ఆ దుమ్ము ధూళి వలన శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు జ్వరం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని వారు తెలిపారు. మా పొలాలపైకి దుమ్ము రావడం వలన సరిగా పంటల దిగుబడి లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల తక్షణం అధికారులు స్పందించి మా దారిలో వచ్చే వాహనాలు నిలిపి వేసి , వాహనాలకు వేరే దారి ఏర్పాటు చేయాలని వారు తెలిపారు.


Conclusion:ప్రజలందరూ ఆ గ్రామాలకు వెళ్ళే దారిలో ముగ్గురాయి వాహనాలు రాకుండా నిలుపుదల చేసి ఆ గ్రామాల రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.