అనంతపురం జిల్లా గుత్తి సబ్జైల్లో నలుగురు ఖైదీలకు కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు జైల్ సూపరింటెండెంట్ రమేశ్ తెలియజేశారు. వారం రోజుల క్రితం జైలులోని ఆరుగురికి కరోనా నిర్ధారణ కాగా.. మిగతా 64 మంది ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురు రిమాండ్ ఖైదీలకు కొవిడ్ నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు.
నలుగురిని జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. గుత్తి సబ్జైల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా సోకినట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
కిరికెర వద్ద ప్రభుత్వ స్థలం కబ్జా... ఆక్రమణదారులకు నోటీసులు జారీ