ETV Bharat / state

కంటైనర్​లో మంటలు.. తప్పిన ప్రమాదం - అనంతపురం త్రిశూల్ కంపెనీలో అగ్ని ప్రమాదం వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని దుద్దేబండ కూడలిలోని ఓ వ్యవసాయ భూమిలో త్రిశూల్ కంపెనీ.. తమ సిబ్బంది నివాసం కోసం ఏర్పాటు చేసిన కంటైనర్​లో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కంటైనర్​లో మంటలు.. తప్పిన ప్రమాదం
కంటైనర్​లో మంటలు.. తప్పిన ప్రమాదం
author img

By

Published : Nov 23, 2020, 10:58 AM IST

త్రిశూల్ కంపెనీ సిబ్బంది నివాసం కోసం ఏర్పాటు చేసిన కంటైనర్​లో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ అందులో లేని కారణంగా.. పెను ప్రమాదం తప్పిందని పెనుగొండ అగ్నిమాపక కేంద్ర అధికారి విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం కంటైనర్​లో ఉన్న సిబ్బంది డ్యూటీ కి వెళ్ళిన తర్వాత ఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న కియా పరిశ్రమ అగ్నిమాపక వాహనం, పెనుగొండ అగ్నిమాపక కేంద్రం వాహనం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సిబ్బంది వస్త్రాలు, విద్యార్హత పత్రాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

త్రిశూల్ కంపెనీ సిబ్బంది నివాసం కోసం ఏర్పాటు చేసిన కంటైనర్​లో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఎవరూ అందులో లేని కారణంగా.. పెను ప్రమాదం తప్పిందని పెనుగొండ అగ్నిమాపక కేంద్ర అధికారి విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం కంటైనర్​లో ఉన్న సిబ్బంది డ్యూటీ కి వెళ్ళిన తర్వాత ఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న కియా పరిశ్రమ అగ్నిమాపక వాహనం, పెనుగొండ అగ్నిమాపక కేంద్రం వాహనం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సిబ్బంది వస్త్రాలు, విద్యార్హత పత్రాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

ఇదీ చదవండి:

తుంగభద్ర పుష్కరాలు: మూడో రోజు సందడి అంతంతే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.