ETV Bharat / state

అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం... రూ.1.60 లక్షల వేరుశనగ పొట్టు దగ్ధం

author img

By

Published : Mar 22, 2021, 10:41 AM IST

అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒకరి నిర్లక్షం కారణంగా రూ.1.60 లక్షల వేరుశనగ పొట్టు అగ్నికి దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నారు.

fire accident in anantapur district
అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి పెద్ద తండాలో అగ్నిప్రమాదం జరిగింది. రాందాస్ నాయక్ అనే రైతుకు చెందిన 8 ట్రాక్టర్ల వేరుశనగ పొట్టు దగ్ధమైంది. ఒకరు నిర్లక్ష్యంగా పొగ తాగి ఆ పొట్టుపై వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు రూ.1,60,000 నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లేకుంటే మరికొన్ని వాటికి అంటుకొని భారీగా నష్టం వచ్చేదాని రైతు అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటంపల్లి పెద్ద తండాలో అగ్నిప్రమాదం జరిగింది. రాందాస్ నాయక్ అనే రైతుకు చెందిన 8 ట్రాక్టర్ల వేరుశనగ పొట్టు దగ్ధమైంది. ఒకరు నిర్లక్ష్యంగా పొగ తాగి ఆ పొట్టుపై వేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు రూ.1,60,000 నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. లేకుంటే మరికొన్ని వాటికి అంటుకొని భారీగా నష్టం వచ్చేదాని రైతు అన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: బైక్​ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి మరొకరికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.