అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై టెంపో వాహనం బొల్తా పడింది. ఈ ఘటనలో ఒక రైతు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరం మండలం మాలగుండ్లపల్లికి చెందిన హరి...కూరగాయలను టెంపో వాహనంలో బెంగళూరు సిటీ మార్కెట్కు తరలించేందుకు బయలుదేరాడు. మేమూ వస్తామంటూ మరో నలుగురు రైతులు ఆ వాహనంలో వెళ్లారు. ఈ క్రమంలో పాపిరెడ్డిపల్లి వద్ద వాహనం అదుపు తప్పి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో హరి అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు సహా టెంపో వాహన డ్రైవర్ తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేసిన దుండగులు