ETV Bharat / state

'అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు'

రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు సీఎం జగన్ విదేశీ పర్యటనలు చేశారని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 13 నుంచి 2రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరుగుతుందని వివరించారు.

author img

By

Published : Sep 1, 2019, 8:51 PM IST

ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం
ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. 6మాసాల్లో వాటికి అమలుకు అడుగులు పడుతాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధి దర్శనం కోసం పుట్టపర్తి వచ్చిన సీఎస్... సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలు చేశారని చెప్పారు. ఈనెల 13 నుంచి 2రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వ వైద్య సేవలు అనుసంధానం చేస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. త్వరలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ...పవన్ ద్వంద్వ వైఖరి మార్చుకో: బొత్స

ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. 6మాసాల్లో వాటికి అమలుకు అడుగులు పడుతాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధి దర్శనం కోసం పుట్టపర్తి వచ్చిన సీఎస్... సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలు చేశారని చెప్పారు. ఈనెల 13 నుంచి 2రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వ వైద్య సేవలు అనుసంధానం చేస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. త్వరలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ...పవన్ ద్వంద్వ వైఖరి మార్చుకో: బొత్స

Intro:AP_GNT_07_01_Police_Raid_Illegal_Card_Game_AV_AP10169
CONTRIBUTOR : ESWARACHARI , GUNTUR

యాంకర్..... గుంటూరు అర్బన్ పరిధిలోని పలు ప్రాంతాలలో పేకాట స్థావరాల పై పోలీసులు దాడులు చేశారు . మంగళగిరి , తాడేపల్లి , నవ్వులూరు , పొన్నెకల్లు , నల్లపాడు , పెద్దపలకలూరు పలు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. 50 మంది పేకాట రాయుళ్లను అదుపులోకితీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 7 లక్షల నగదు , 44 సెల్ ఫోన్స్ , 4 ద్విచక్ర వాహనాలును స్వాధీనం చేసుకున్నారు. వారిపైన కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తూమని పోలీసులు వెల్లడించారు.
Body:విజువల్స్ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.